- గిరిజన సంక్షేమ భవనం ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో నూతనంగా నిర్మించిన గిరిజన సంక్షేమ భవనాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనులకు తగిన గౌరవం సీఎం కేసీఆర్ కల్పించారని, గిరిజన తండాలను నూతన గ్రామపంచాయతీలుగా చేసి వారి నిధులు వాళ్ళకి కేటాయించి తండాల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కిందాని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు BSN కిరణ్ యాదవ్, నడిగడ్డ తండా అధ్యక్షులు తిరుపతి నాయక్, ఉపాధ్యక్షులు స్వామి నాయక్, కార్యదర్శి రత్నాకర్, శంకర్ నాయక్, పి . మోహన్ అబ్రహం, సుధాకర్, కమలాకర్ , జితేందర్ నాయక్, గోపి నాయక్, సోమేశ్, హరి నాయక్, శంకర్ రాథోడ్, ఆంజనేయులు చారి, చిరంజీవి పాల్గొన్నారు.