క్రీడాకారులకు ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తా: రవికుమార్ యాదవ్

  • క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: రెండు వారాలుగా వట్టినాగుల పల్లి లోని ఎం స్పోర్ట్స్ స్టేడియంలో క్రికెట్ పోటీలు జరుగుతున్న విషయం విదితమే. అయితే ఈ పోటీల్లో లింగంపల్లి డివిజన్ సురభి కాలనీవాసుల ఫైటర్స్ కింగ్ , రిలేషన్ ఫైటర్స్ జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ సందర్బంగా ఇరు జట్లకు బిజెపి పార్టీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ బహుమతులు అందజేశారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ కాలనీవాసులు ఒక మంచి క్రీడను ఎంచుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడడం అనేది శుభపరిణామమని తెలుపుతూ.. సహాయ సహకారాలు అందించిన వారిని అభినందించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులకు ఎల్లప్పుడు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, వచ్చే నెలలో తమ ట్రస్ట్ తరఫున క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తామని క్రీడాకారులకు తీపి కబురు అందించారు. కార్యక్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు, నాయకులు మారబోయిన అనిల్ కుమార్ యాదవ్, ఆదిత్య కుమార్, శ్రీకాంత్, పాల్గొన్నారు.

విజేతలుగా నిలిచిన యాక్రీడాకారులకు బహుమతులు అందిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here