మత సామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ 

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్ లో “ఖ్వాజ గరీబ్ నవాజ్” దర్గా ఉర్సు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించి ప్రార్థనలు చేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. గురువారం రాత్రి గోపినగర్ లోని “ఖ్వాజ గరీబ్ నవాజ్” దర్గాలో నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దర్గా నిర్వాహకులు కార్పొరేటర్ ని శాలువలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సమక్షంలో “గంధం” (సంధల్) ఊరేగింపు భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేక చాదర్ తో…

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మా, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, షేక్ రజాక్, రయాజ్, మొహమ్మద్ దస్తగిర్, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, షకీల్, దేవులపల్లి శ్రీకాంత్, నర్సింహా, సత్యనారాయణ, మహేందర్ సింగ్, షేక్ ఖాజా, షేక్ నవాజ్, ఫకృద్దీన్, ఇజాజ్, ఇలియాజ్, ఎండి జానీ, అబ్దుల్ గని, మొహమ్మద్ జాకీర్, మహమ్మద్ చాంద్, మొహమ్మద్ అజం ఖాన్, షేక్ నూర్, మొహమ్మద్ జాఫర్, మొహమ్మద్ అక్బర్, ఖాదర్, అలీం, నదీమ్, కుమార్, సురేష్, విట్టల్, రవి, శ్యామ్, లడ్డు, దివ్య పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here