బంపర్ మెజారిటీతో గెలిపించండి

  • ఇంటింటి ప్రచారంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : నియోజకవర్గంలో అభివృద్ధి, సుపరిపాలన జరగాలంటే బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని బంపర్ మెజారిటీతో గెలిపించాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కోరారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని రాజీవ్ గృహకల్ప, ఆరంభ టౌన్షిప్ లలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేపట్టారు.

పార్టీ కరపత్రం అందజేిసి కాసాని జ్ఙానేశ్వర్ ని గెలిపించాలని కోరుతున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వార్డ్ మెంబర్లు, బస్తీ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, బూత్ కమిటీ మెంబర్లు, మహిళా నాయకురాళ్లు, శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here