అభివృద్ధి, పురోగతి బిజెపి గెలుపుతోనే సాధ్యం

  • 101 వ రోజు గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి :  గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్రలో భాగంగా చందానగర్ అన్నపూర్ణ ఎన్ క్లేవ్, శ్రీరాంనగర్ కాలనీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ గడపగడపకు తిరుగుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు కరపత్రాల ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు జరగబోయే సాధారణ ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో కాషాయ జెండా ఎగరవేసి, టిఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని,  నియోజకవర్గం ప్రజలు ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి కంకణ అబ్దులై ఉన్నారని తెలియజేస్తూ, ప్రజా ఆశీర్వాదం కోరుతూ గడపగడప తిరుగుతూ బిజెపి పార్టీకి ఓటు వేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేట్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి, సింధూ రెడ్డి, రామిరెడ్డి, అర్జున్, విజయ్, ప్రభాకర్, గౌస్ బాయ్, చందర్ యాదవ్, పృథ్వీ గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here