నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్, కేశవ్ నగర్ బస్తీలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. ఇందులో భాగంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-14-at-6.52.09-PM-1.jpeg)
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బసవతారక నగర్ బస్తీ ప్రజలకు పట్టాలు, ఇంటింటికి కరెంట్ మీటర్లు, నల్ల కనెక్షన్లు వచ్చేలా చూస్తామని, కేశవ నగర్ బస్తీలో పట్టాలు రాని ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-14-at-6.52.09-PM.jpeg)
ఈ కార్యక్రమంలో నాయకులు పి.సురేందర్, కున సత్యం గౌడ్, రమేష్, అనిల్, రాధాకృష్ణ, వెంకటేష్, మహేష్, శివ, శ్రీశైలం, నర్సింహ, సాయి బాబా, అర్జున్, గోవింద్, గిరి, ముత్యాలు, కాశీ, వెంకటేష్, మొగులేష్, అంజి, తిమ్మయ్య, శైలు, కృష్ణ పాల్గొన్నారు