పేదలకు ఇళ్ల స్థలాలు అందేలా చూస్తాం : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్, కేశవ్ నగర్ బస్తీలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. ఇందులో భాగంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు.

గచ్చిబౌలి డివిజన్ పరిధిలో పేదలను కలిసి ఇండ్ల పట్టాలు గురించి మాట్లాడుతున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బసవతారక నగర్ బస్తీ ప్రజలకు పట్టాలు, ఇంటింటికి కరెంట్ మీటర్లు, నల్ల కనెక్షన్లు వచ్చేలా చూస్తామని, కేశవ నగర్ బస్తీలో పట్టాలు రాని ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు.

బసవతారక నగర్ శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలిస్తున్న జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో నాయకులు పి.సురేందర్, కున సత్యం గౌడ్, రమేష్, అనిల్, రాధాకృష్ణ, వెంకటేష్, మహేష్, శివ, శ్రీశైలం, నర్సింహ, సాయి బాబా, అర్జున్, గోవింద్, గిరి, ముత్యాలు, కాశీ, వెంకటేష్, మొగులేష్, అంజి, తిమ్మయ్య, శైలు, కృష్ణ పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here