పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ గోపంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూత్ కమిటీ సభ్యులతో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

గోపంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూత్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుడిలా పని చేసి రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బూత్ స్థాయి నుంచే ప్రతిఒక్కరు కష్టపడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పి.సురేందర్, రాధాకృష్ణ, రాజు, వెంకటేష్, అనిల్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here