ఆర్.కే.వై టీం ఆధ్వర్యంలో వాకర్స్ కు ఉచిత వైద్య శిబిరం

  • వైద్య పరీక్షలను పరిశీలించిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
వాకర్లతో కలిసి వాకింగ్ చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్, పటేల్ కుంట పార్కు వాకర్స్ కు ఆర్.కే.వై టీం ఆధ్వర్యంలో ఉద్భవ చిల్డ్రన్ హాస్పిటల్ సౌజన్యంతో… ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో ఒత్తిడి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలంటే బీపీ షుగర్ అదుపులో పెట్టుకోవలసిన అవసరం ఉందని గుర్తు చేశారు. వాకింగ్ చేస్తున్న వాకర్స్ కు అభినందనలు తెలిపి ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. ఈ సందర్భంగా వాకర్సు రవికుమార్ యాదవ్ దృష్టికి ఇక్కడ మౌలిక సదుపాయాలు సరిగా లేవని, టాయిలెట్ శుభ్రంగా లేవని, ఓపెన్ జిమ్ సామాగ్రిని ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి రవికుమార్ యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ జి.హెచ్.ఎమ్.సి దృష్టికి తీసుకెళ్లి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వాకర్లు సత్యనారాయణ, నర్సింగ్ యాదవ్, చారి, నర్సింగ్ రావు భాస్కర్ రెడ్డి, అంజయ్య, యాదవ్, గోపాల్ రావు, వెంకటస్వామి రెడ్డి, ఎత్తరి రమేష్, కృష్ణ పాల్గొన్నారు.

వైద్య పరీక్షలను పరిశీలిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here