మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మి నగర్ కాలనీలో మందాడి మగ్నుస్ అపార్ట్ మెంట్స్ అసొషియన్ సభ్యులు. రామ్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మెడికేర్ & యశోద హాస్పిటల్స్ సౌజ్యన్యం తో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని అసొషియన్ సభ్యులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రయివేట్ హాస్పిటల్స్ పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు.

శ్రీ లక్ష్మి నగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా మందులు, పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని, భవిషత్తు లో ఇలాంటి క్యాంపులు మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్బంగా మందాడి మగ్నుస్ అపార్ట్ మెంట్స్ అసొషియన్ సభ్యులు, రామ్ సుబ్బారెడ్డి ని అభినందించారు. డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలలో కాలనీల అసోసియేషన్ సభ్యులు హాస్పిటళ్ల సహకారంతో ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసి, పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికేర్ & యశోద హాస్పిటల్స్ డాక్టర్స్, సిబ్బంది, మందాడి మగ్నుస్ అపార్ట్ మెంట్స్ అసొషియన్ సభ్యులు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరంలో మందాడి మగ్నుస్ అపార్ట్ మెంట్స్ అసొషియన్ సభ్యులతో ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here