ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట డివిజన్ పరిధిలోని ఇంజనీర్స్ ఎం క్లేవ్ కమ్యూనిటి హాలు వద్ద సిటిజెన్ హాస్పటల్, నల్లగండ్ల సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, రక్తపోటు, షుగర్, పల్స్, కంటి, దంతపరీక్షలతోపాటు ఈ.సీ.జీ. తదితర పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ తహా జనరల్ ఫిజిషియన్, డాక్టర్ అక్షయ డెంటల్, శివ ఆఫ్తమాలజిస్ట్ లు 102 మందికి వైద్యసేవలు అందించారు.

అనంతరం మాట్లాడుతూ ప్రతిఒక్కరు నిత్యవ్యాయామం, మెడిటేషన్, యోగ, ధ్యానము, నడక, కనీసం 40 నిమిషాలు చేయాలని, సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాలఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆంజనేయ రాజు, కరుణాకర్ గౌడ్, చంద్రశేఖర్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, జనార్ధన్, శివ రామిరెడ్డి, అమ్మయ్య చౌదరి, రామిరెడ్డి (సీనియర్ సిటిజెన్ ఫోరమ్ అధ్యక్షుడు), హాస్పిటల్ ప్రతినిధులు జాకీర్ హుస్సేన్, హరీష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here