లక్ష దీపోత్సవంలో వేడుకగా వేంకటేశ్వర స్వామి కళ్యాణం

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పఎంక్లేవ్ లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక మాస లక్ష దీపోత్సవాలు భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం చందానగర్ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులు కె.వి.వి. రమేష్. సరస్వతి దంపతులు వేంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. విశాఖ శ్రీ శారదా పీఠం తెలంగాణ ఆగమ సలహాదారు శ్రీ సుదర్శనం సత్యసాయి ఆచార్యులు పర్యవేక్షణలో కళ్యాణం మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.

శ్రీవారి కళ్యాణం జరిపిస్తున్న విశాఖ శ్రీ శారదా పీఠం తెలంగాణ ఆగమ సలహాదారు శ్రీ సుదర్శనం సత్యసాయి ఆచార్యులు

దీపోత్సవంలో ఆల‌య వ్య‌వ‌స్థాప‌క చైర్మ‌న్ యూవీ ర‌మ‌ణ‌మూర్తి, క‌మిటి స‌భ్యులు చంద్ర‌శేఖ‌ర్‌, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, సుధాకర్, విద్యాసాగర్ ఇతర సభ్యులు, శిల్పాఎన్‌క్లేవ్ కాల‌నీ సంక్షేమ సంఘం స‌భ్యులు, కాల‌నీ వాసులు, ఆల‌య సేవాద‌ళం స‌భ్యులు, ప‌రిసర ప్రాంతాల భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని ఉత్సాహంగా ప‌దివేల‌ దీపాలు వెలిగించారు. దీప కాంతులతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి.

వేంకటేశ్వర స్వామి కళ్యాణం తిలకిస్తున్న భక్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here