ధర్మపురి క్షేత్రంలో కన్నులపండువగా శ్రీరామనవమి వేడుకలు- ముత్యాల తలంబ్రాలను అందజేసిన షాబాజ్ షరీప్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని ధర్మపురి క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. జనకమహారాజుగా కోనేరు వెంకటేశ్వర రావు, సునయనగా దైవాదీనం, దశరథ మహారాజుగా పద్మశ్రీ డాక్టర్ సాయిబాబా గౌడ్, కౌసల్యగా జ్యోత్స వ్యవహరించి గోత్రనామాలతో సీతారాముల కళ్యాణోత్సవం సత్యవాణి అమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ధర్మపురి క్షేత్రంలో సీతారాముల ‌కళ్యాణ మహోత్సవాలలో

ప్రతి సంవత్సరం మాదిరిగానే మియాపూర్ గ్రామానికి చెందిన షాబాజ్ షరీప్ సీతారాముల కళ్యాణోత్సవానికి ముత్యాల తలంబ్రాలను తీసుకువచ్చారు. సత్యకీర్తి సంగీత దామ బాలాజీ తమ శిష్యులతో గణపతి స్తుతి, సీతారాముల గాధను నృత్యప్రదర్శన ద్వారా ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. భక్తుల కోసం అన్నదాన ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. కళ్యాణ మహోత్సవంలో‌ భక్తులు‌‌ అధిక సంఖ్యలో హాజరై రాముని అనుగ్రహం పొందారు.

సీతారాముల వారికి ముత్యాల తలంబ్రాలను అందజేస్తున్న షాబాజ్ షరీప్

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here