ఘనంగా స్వామి వారికి పుష్పక వాహన సేవ

నమస్తే శేరిలింగంపల్లి: విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత చందానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సముదాయంలోని శ్రీ భవాని శంకరాలయ ద్వావింశతి (22వ) శివోత్సవాలలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 7.30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, హారతి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు పుష్పక వాహన సేవ, రాత్రి 8.30 గంటలకు స్వామి వారికి లోక కళ్యాణార్థం శ్రీ పుష్ప యాగం ఘనంగా నిర్వహించారు. ఋత్వికులకు, దాతలకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. పుష్పక వాహన సేవ కార్యక్రమం లో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here