శానిటేషన్ సమస్యను పరిష్కరిస్తాం – చందానగర్ ‌కార్పొరేటర్ మంజుల రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: పరిసరాల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వెంకటాద్రి కాలనీ, విశ్వేశ్వర కాలనీ, పద్మజా రెడ్డి కాలనీలలో శానిటేషన్ విభాగం అధికారులు, కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పర్యటించారు. ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. పారిశుధ్య కార్మికులకు కాలనీ వాసులు సహకారం అందించాలని సూచించారు. డివిజన్ పరిధిలో పారిశుధ్య కార్మికుల, ఎస్ఎఫ్ఏ ల సంఖ్య తక్కువగా ఉందని వారి సంఖ్య పెంచాలని ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్ ల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. త్వరలోనే అన్ని కాలనీలలో పారిశుధ్య పనులు మెరుగు పడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ శానిటేషన్ విభాగం అధికారులు ఎస్ ఆర్ పీ లు గంగిరెడ్డి, బాలాజీ, కనకరాజు, టిఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు ఓ.వేంకటేష్, సుబ్బారావు, శ్రీనివాస్ రెడ్డి, సదానందం, రాజశేఖర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, నర్సింహా, నరేష్ రెడ్డి, కొండల్ రెడ్డి, హరీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శానిటేషన్ సిబ్బందితో మాట్లాడుతున్న చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here