భూతవాహనంపై భవానీశంకరుల ఊరేగింపు

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లోని శ్రీ‌ భవాని శంకరాలయంలో ద్వావింశతి శివోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వార్ల దివ్యాశీస్సులతో ఈ నెల 24వ తేదీ వరకు శివోత్సవములు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు భవానీ శంకరులకు భక్తులు ప్రత్యేక పూజలు‌ జరిపించారు. ఉదయం 9 గంటలకు మహాలింగార్చన, మధ్యాహ్నం హారతి తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. రాత్రి 7 గంటలకు నిత్య హోమము, భవాని శంకరుల విగ్రహాలను భూత వాహన సేవ ద్వారా పురవీధుల గుండా ఊరేగింపు, జ్యోతిర్లింగార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడి ప్రాంత భక్తులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో‌ హాజరై స్వామి వారి కృపకు‌ పాత్రులయ్యారు.

భూత వాహనంపై‌ భవానీ శంకరుల విగ్రహాల ఊరేగింపు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here