ఆటోమొబైల్ టిఫిన్ సెంటర్ వాహనం ప్రారంభం

  • లబ్ధిదారుడికి అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: దళితబంధు పథకంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కి చెందిన రాజేందర్ కి మంజూరైన ఆటోమొబైల్ టిఫిన్ సెంటర్ వాహనాన్ని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ , మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో కలిసి లబ్దిదారుడికి అందచేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దశలవారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలవుతున్నదన్నారు. దళిత బంధు పథకం కింద మొబైల్ టిఫిన్ సెంటర్ వాహనాన్ని పొందిన లబ్ధిదారురాడు రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. కార్యక్రమంలో తెరాస నాయకులు బ్రిక్ శ్రీనివాస్, సురేందర్, రాజు, మహేష్ పాల్గొన్నారు.

ఆటోమొబైల్ టిఫిన్ సెంటర్ వాహనాన్ని లబ్ధిదారుడికి అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here