దళిత బంధు పూర్తి స్థాయిలో అమలవుతుంది : ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: దళితబంధు పథకంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని PA నగర్ కాలనీ కి చెందిన పందిరి శిరోమణికి Ertiga కార్ మంజూరైంది. ఈ కారును కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాసరావు, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లబ్దిదారుకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని అన్నారు. దళిత బంధు పతాకం కింద కారును పొందిన సందర్భంగా లబ్ధిదారురాలు శిరోమణి హర్షం వ్యక్తం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మాజీ ఎంపీపీ ఎర్ర నర్సయ్య, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, ప్రో.పి.వై.రమేష్, ఇరుగు అరుణ పాల్గొన్నారు.

దళితబంధు పథకంలో భాగంగా లబ్ధిదారురాలు శిరోమణికి Ertiga కార్ ను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here