శిల్పారామంలో‌ ఆకట్టుకున్న నృత్యప్రదర్శనలు

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని‌‌ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చేపట్టిన‌ నృత్య ప్రదర్శనలు ఆహుతులను‌ ఆకట్టుకున్నాయి. వర్ణ ఆర్ట్స్ అకాడమీ స్మిత మాధవ్, భార్గవి శిష్యులు కుమారి అనన్య ఆచంట చేసిన భరతనాట్య నృత్య ప్రదర్శన, లలిత చంద్రమూర్తి ఒడిసి నృత్య ప్రదర్శనలో భాగంగా మంగళాచరన్, మోహన పల్లవి,  మోక్ష  అంశాలు‌ పలువురిని అలరించాయి. బెంగళూరుకి చెందిన కళాకారులు అంజు పీటర్, మొహినియాట్టం ప్రదర్శనలో చోళకేటు, పదం, సప్తమ అంశాలను ప్రదర్శించి పలువురిని ఆకట్టుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here