నమస్తే శేరిలింగంపల్లి: ఆల్ ఇండియా సారీ మేళ, నవ రాత్రి ఉత్సవాలు, దాండియా, సాంస్కృతిక కార్యక్రమాలతో మాదాపూర్ లోని శిల్పారామంలో సందడి వాతావరణం నెలకొంది. చేనేతలు ప్రదర్శించిన చీరల స్టాల్స్ మహిళలను ఆకట్టుకుంటున్నాయి. మహిళా సిబ్బంది ప్రతి రోజు బతుకమ్మ పాటలను పాడుతూ దాండియా ఆడుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రమోద్ కుమార్ రెడ్డి శిష్య బృందం చే నవదుర్గ భరతనాట్య నృత్య రూపక ప్రదర్శన పలువురిని విశేషంగా అలరించింది. నవదుర్గ అమ్మవార్ల గురించి పురాణం కథలను చక్కగా అభినయించారు. అరుణ జ్యోతి,మాధురి, శ్వేతా, రితిక, విభూతి, అక్షయ, మనోజ్ఞ, కృతి, శశాంక్, భవ్య తదితరులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

