జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమితులైన గరికపాటి మోహనరావుకు బిజెపి నాయకుల శుభాకాంక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గా నియమితులైన గరికపాటి మోహన్ రావు కు బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి నాయకులు మొవ్వా సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు ఆయన స్వగృహంలో కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ గరికపాటి మోహన్ రావు క్రమశిక్షణ, ఓర్పు కు మారుపేరని, కష్టపడే వ్యక్తిత్వం తో పాటు కార్యకర్తలతో మంచి అనుబంధం గల నాయకుడు గరికపాటి మోహన్ రావు అని అన్నారు. బీజేపీ మరింత బలపడనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనేరు సత్యనారాయణ, డిఎస్అర్ కె ప్రసాద్, హరి, వినయ్, దుర్గాప్రసాద్, సాంబయ్య, గిరి, పృథ్వి, ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.

గరికపాటి మోహన్ రావుకు శుభాకాంక్షలు తెలుపుతున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here