ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా యువ‌కుడి ఆత్మ‌హ‌త్య

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మాదాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్ర‌కారం ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. మాదాపూర్ ప‌రిధిలోని అరుణోద‌య కాల‌నీలో ఉన్న శ్రీ నిర్వాణ హోట‌ల్‌లో ఈ నెల 7వ తేదీన నిమ్మ వంశీకృష్ణారెడ్డి (25) అనే యువ‌కుడు రూమ్‌ తీసుకున్నాడు. తాను జాబ్ కోసం వ‌చ్చాన‌ని తెలిపాడు. ఈ నెల 8వ తేదీన అత‌ను త‌న హోట‌ల్ రూమ్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా వంశీకృష్ణారెడ్డి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయ‌ని, అందుక‌నే అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు.

వంశీకృష్ణారెడ్డి (ఫైల్‌)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here