వడ దెబ్బకు గుర్తు తెలియని వ్యక్తి మృతి

నమస్తే శేరిలింగంపల్లి: వడ దెబ్బకు గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దీప్తి శ్రీ నగర్ మియాపూర్ బస్ స్టాప్ వద్ద పడుకుని ఉన్న ఒక మగమనిషి శుక్రవారం రాత్రి మృతిచెందాడు. బిక్షాటన చేస్తూ ఎండ వేడిమికి తాళలేక మృతిచెందినట్లు చెప్పారు. గుర్తు తెలియని మృతుని వయస్సు 30 – 35 సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు చెప్పారు. మృతునికి సంబంధించిన సమాచారం ఉంటే మియాపూర్ పోలీస్ స్టేషన్ కు, 9491053243, 7901112271‌ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here