వృద్ధురాలి మృత‌దేహం ల‌భ్యం

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఓ గుర్తు తెలియ‌ని వృద్ధురాలి మృత‌దేహం చందాన‌గ‌ర్ పోలీసుల‌కు ల‌భ్య‌మైంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం గోప‌న్‌ప‌ల్లిలోని అక్ష హాస్పిట‌ల్ వద్ద ఓ వృద్ధురాలి మృత‌దేహం ప‌డి ఉంద‌న్న స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆ వృద్ధురాలు స్థానికంగా యాచ‌కురాలిగా జీవిస్తుంద‌ని, బ‌హుశా ఆహారం లేక‌పోవ‌డం వ‌ల్ల మృతి చెంది ఉంటుంద‌ని, ఆమె వ‌యస్సు సుమారుగా 70 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. ఎవ‌రైనా గుర్తు ప‌ట్ట‌ద‌లిస్తే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని వారు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here