రోడ్డు ప్రమాదంలో సాప్ట్ వేర్ ఉద్యోగి మృతి

నమస్తే శేరిలింగంపల్లి: అతివేగం, అజాగ్రత్తతో ర్యాష్ డ్రైవ్ చేస్తున్న ద్విచక్రవాహనదారుడు రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లాకు చెందిన నెల్లూరు జిల్లా పోలీస్ కాలనీకి చెందిన పోలిశెట్టి జయకృష్ణ (24) కాప్ జెమినీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై గౌలిదొడ్డి నుంచి గచ్చిబౌలికి వెళుతున్న క్రమంలో ఐఎస్ బీ మెయిన్ గేట్ దాటిన తర్వాత‌ తన ద్విచక్రవాహనాన్ని అతివేగంతో, ర్యాష్‌గా నడుపుతూ రోడ్డు మీడియన్‌ పైకి దూసుకెళ్లాడు. హెల్మెట్ ధరించకపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి మామ నామా సుధాకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

పోలిశెట్టి జయకృష్ణ (పైల్ ఫోటో)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here