పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి – మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: పట్టణాలు, పల్లెలు అన్ని రంగాలలో సమగ్ర సమ్మిళిత అభివృద్దే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ, మియాపూర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బస్తీలలో, కాలనీలలో ఉన్న చెత్తను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్ర పరచడం, మురికి నీటి గుంతలను తొలిగించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా చేయడం జరుగుతుందని అన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, రాబోయే వర్షాకాలం దృష్ట్యా నీటి నిలువ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, లావణ్య, తిమ్మరాజు, కాలనీ వాసులు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎంటమాలజి సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతి లో మురికి కాలువలను శుభ్రం చేయిస్తున్న మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here