నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కళాకారుల నృత్యప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మైసూర్ నుండి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య కళాకారులు కాలార్పణం బృందం పవన్ కుమార్, విదుషి శుభ్రత, శ్రీ గుణశంకర స్వామి, రష్మీ ఆచార్ ఎంతో చక్కని ప్రదర్శన తో సందర్శకులను ఆకట్టుకున్నారు. పుష్పాంజలి, దేవి స్తుతి, వర్ణం, పదం, దేవర్ణమా, మైసూర్ జతి, శివ స్తుతి, తిల్లాన, మంగళం అంశాలను ఎంతో చక్కని అభినయం, తాళ లయ విన్యాసాలు ప్రదర్శించారు.
