వాట‌ర్ హీట‌ర్ విద్యుత్ షాక్‌తో యువ‌కుడి మృతి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌మాద‌వ‌శాత్తూ వాట‌ర్ హీట‌ర్ విద్యుత్ షాక్ త‌గ‌ల‌డంతో ఓ వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈవిధంగా ఉన్నాయి. మ‌దీనాగూడ‌లోని క‌ల్కి గార్డెన్స్‌లో నివాసం ఉంటున్న పెర్ల వెంక‌ట ల‌క్ష్మీకాంత్ రెడ్డి (18) స్థానికంగా ప్ర‌యివేటు ఉద్యోగిగా ప‌నిచేస్తున్నాడు.

కాగా సోమ‌వారం ఉద‌యం ఇంట్లో స్నానం చేసేందుకు గాను బాత్‌రూమ్‌లో బ‌కెట్‌లో నీళ్ల‌ను వేడి చేసేందుకు అందులో హీట‌ర్ పెట్టాడు. నీళ్లు వేడ‌య్యాక హీట‌ర్ తీసేందుకు పట్టుకోగా విద్యుత్ షాక్‌కు గుర‌య్యాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అత‌న్ని చికిత్స నిమిత్తం స‌మీపంలో ఉన్న ప్ర‌ణామ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే హాస్పిట‌ల్‌కు వెళ్లే స‌రికి అత‌ను చ‌నిపోయాడు. ఈ క్ర‌మంలో స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here