వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాలి: ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విఘ్నాల‌ను తొల‌గించే వినాయ‌కుడికి మొద‌టి పూజ చేస్తే ఎలాంటి ప‌ని త‌ల‌పెట్టినా నిర్విఘ్నంగా కొన‌సాగుతుంద‌ని శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ అన్నారు. సోమ‌వారం హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని ఓల్డ్ హ‌ఫీజ్‌పేటలో ఏర్పాటు చేసిన వినాయ‌క మండపం వ‌ద్ద గాంధీ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంతరం నిర్వ‌హించిన అన్న‌దానం కార్య‌క్ర‌మంలో పాల్గొని భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాన్ని వ‌డ్డించారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. వినాయ‌కుడికి తొలి పూజ చేస్తే ఆయ‌న మ‌న‌కు జీవితంలో ఎదుర‌య్యే అన్ని విఘ్నాల‌ను తొల‌గిస్తాడ‌ని, అందుక‌నే ఆయ‌న‌కు విఘ్నేశ్వ‌రుడ‌నే పేరు వ‌చ్చింద‌ని తెలిపారు.

వినాయ‌కుడికి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

భ‌క్తులు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను జ‌రుపుకోవాల‌న్నారు. నిమ‌జ్జ‌నాల కోసం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని చెరువులు, కుంట‌ల వ‌ద్ద అన్ని ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఉత్స‌వ క‌మిటీలు, అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాబు గౌడ్, అవినాష్ గౌడ్, అరవింద్ గౌడ్, అన్వేష్ గౌడ్, బన్నీ గౌడ్, లక్కీ గౌడ్, ప్రణవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here