భార్య‌తో గొడ‌వ‌ప‌డి భ‌ర్త ఆత్మ‌హ‌త్య

మియాపూర్‌, సెప్టెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భార్య‌తో గొడ‌వ‌ప‌డిన భ‌ర్త మ‌న‌స్థాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్ర‌కారం ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సున్నిపెంట గ్రామానికి చెందిన ఎస్కే ర‌ఫీ (29), శ్రావ‌ణిలు 4 ఏళ్ల కింద‌ట ప్రేమ పెళ్లి చేసుకుని న‌గ‌రానికి వ‌చ్చి స్థానికంగా మియాపూర్‌లో నివాసం ఉంటూ జీవ‌నం సాగిస్తున్నారు.

ఎస్కే ర‌ఫీ మృత‌దేహం

ర‌ఫీ ఆటోడ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, శ్రావ‌ణి మియాపూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ప‌నిచేస్తోంది. కొంత కాలం కింద‌ట ఇద్ద‌రికీ మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చి గొడ‌వ‌ప‌డి దూరంగా ఉంటున్నారు. దీంతో భార్య శ్రావ‌ణిని ఒప్పించి ఇంటికి తీసుకెళ్దామ‌ని ర‌ఫీ ప్ర‌య‌త్నించాడు. కానీ మ‌ళ్లీ గొడ‌వైంది. దీంతో తీవ్ర మ‌న‌స్థాపం చెందిన ర‌ఫీ మియాపూర్‌లోని బీకే ఎన్‌క్లేవ్‌లో ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ర‌ఫీ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here