శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ అనాథాశ్రమం సంరక్షణలో ఉన్న ఓ బాలిక అదృశ్యం అయిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లింగంపల్లి రైల్వే పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులు జూన్ 13వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు ఆయేషా (7) అనే బాలికను మియాపూర్లో ఉన్న వివేకానంద సేవా సంఘం వృద్ధ, అనాథాశ్రమంలో చేర్పించారు. కాగా ఆ బాలిక జూన్ 15వ తేదీన సాయంత్రం 4.30 గంటల సమయం నుంచి కనిపించడం లేదని ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని సూచించారు.