చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం

నమస్తే శేరిలింగంపల్లి: మతిస్థిమితంగా లేని ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా, దోర్నాల మండలం, ధారూర్ గ్రామంకు చెందిన దాసరి అంజిలయ్య(50) వారం రోజుల క్రితం పక్షవాతానికి గురయ్యాడు. చికిత్సకోసం అతడ్ని పాపి రెడ్డి కాలనీ ఇంటి నెంబర్ 1482లో నివాసముండే కూతురు విజయ లక్ష్మి ఇంటికి తీసుకొచ్చారు. మదినగూడ శ్రీకర హాస్పిటల్ లో గత నాలుగు రోజుల నుంచి అంజిలయ్య కు చికిత్స అందిస్తున్నారు. కాగా బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లిన అంజిలయ్య తిరిగి రాలేడు. బంధువులు స్నేహితులు తెలిసిన వారి వద్ద ఆరా తీసిన అతని జాడ తెలియకపోవడంతో చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంజయ్య ఆచూకీ తెలిసినవారు ఫోన్ నెంబర్ 7901113092, 9440881622 లలో సమాచారం అందించాలని సూచించారు.

అంజిలయ్య
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here