శేరిలింగంపల్లి, డిసెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లింగంపల్లి రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫామ్ నంబర్ 1పై ఓ మహిళ మృతదేహం ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఆ మహిళ గత కొద్ది రోజుల నుంచి చుట్టు పక్కల భిక్షాటన చేస్తూ ఉందని, బహుశా అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండవచ్చని, ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.