జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

నమస్తే శేరిలింగంపల్లి: జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్ మక్తాకు చెందిన చదలవాడ వినయ్ (34) మాధవి గత పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నెల రోజుల క్రితం ఇద్దరికి వివాహం జరిగింది. కాగా జీవితంలో బాగా సెటిల్ అయ్యాక వివాహం చేసుకుందామనుకుని అనివార్యమైన కారణాలతో వివాహం చేసుకున్నారు. జీవితంలో స్థిరంగా సెటిల్ కాకపోవడంతో మనస్థాపానికి గురై జీవితంపై విరక్తితో వినయ్ ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు‌ కాదని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని వినయ్ రాసిపెట్టిన సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు తెలిపారు.

వినయ్ (పైల్‌ఫోటో)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here