హైటెక్ సిటీ అవుట్ పోస్ట్ లో మహిళ దారుణ హత్య

నమస్తే శేరిలింగంపల్లి: గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు‌ గురైన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  పోలీసులు, స్థానికులు తెలిపిన‌ వివరాల మేరకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అవుట్ పోస్ట్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా 34 ఏళ్ల వయస్సు ఉన్న మహిళను హత్య చేసినట్లు గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. మాదాపూర్ పోలీసులు, సైబరాబాద్ కమిషనరేట్ క్లూస్ టీం, సీసీ టీవీలు, డాగ్ స్క్వార్ట్ సహాయంతో వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ హత్య ఎవరు చేశారనేది దర్యాప్తు లో తేలుతుందన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here