చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి

నమస్తే శేరిలింగంపల్లి; గుర్తు తెలియని వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల 29న గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల ఫ్లై ఓవర్ కింద పోచమ్మ గుడి సమీపంలో ఒక భిక్షాటన చేస్తూ జీవించే గుర్తు తెలియని వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండగా పారిశుద్ధ్య కార్మికులు గమనించి అతన్ని 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అతను చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here