శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బాసటగా నిలవడమే లక్ష్యం

  • కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
  • గాంధీ బాట పట్టిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి బాసటగా నిలవాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు మొవ్వా సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, మోహన్ గౌడ్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యంగా భావించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్దే తన ధ్యేయమని, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల అభిష్టం మేరకు వారి సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు. ఏడు నెలలుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటపడిందని, కాంగ్రెస్ పార్టీలో చేరితే అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పోరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పార్టీలో చేరిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here