నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పేట్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుండె దయానంద్ ముదిరాజ్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలన చూసి ఆకర్షితులై ఈ రోజు పెద్ద ఎత్తున సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కలిపిస్తామని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, కంది జ్ఞానేశ్వర్, రఘునాథ్ , బీమమ్మ పాల్గొన్నారు.