కాంగ్రెస్ లో పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు

నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ, గంగారాం విలేజ్ కి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే ఆరెక పూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ యువత చూపు కాంగ్రెస్ వైపేనని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న ప్రజాపాలన చూసి ఆకర్షితులై ఈ రోజు పెద్ద ఎత్తున హఫీజ్పెట్ డివిజన్ నుండి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారన్నారు.

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంది జ్ఞానేశ్వర్, రఘునాథ్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులు సుదేశ్, రోషన్, సలీమ్, బీమమ్మ, గౌస్, రవి, జైపాల్, దస్తప్ప, విజయ్, అబ్రహం, డి.రవి, సల్మాన్ రాజ్, జాహెల్, సునీల్, అనిల్, రాజు, రాబర్ట్, రోహిత్ ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here