కాంగ్రెస్ గూటికి దొంతి కార్తిక్ గౌడ్…

  • చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడికి కండువా కప్పి ఆహ్వానించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నది. ఒక్కొక్కరుగా పలు పార్టీల నుంచి ఆ పార్టీలో చేరుతుండటంతో కాంగ్రెస్ పటిష్టంగా మారుతుంది. చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు దొంతి కార్తిక్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ లింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

దొంతి కార్తిక్ గౌడ్ కు కాంగ్రెస్ కండువా కప్పుతున్న జగదీశ్వర్ గౌడ్

అదేవిధంగా శేరిలింగంపల్లి చందానగర్, శేరిలింగంపల్లి ముఖ్య నాయకులు దొంతి సత్యనారాయణ గౌడ్, రామచందర్ రెడ్డి, సాయి రెడ్డి, దీపక్ గౌడ్, నరేందర్ గౌడ్, శ్రీనివాస్ చారి, ఆనంద్ గౌడ్, సతీష్, మహేష్, శ్రీపాల్ గౌడ్, మహిళ నాయకులు సుధ రాణి, రాధ యూత్ సభ్యులు, యువ నాయకులకు జగదీశ్వర్ గౌడ్ ఖండువాలు కపిపి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన దంతి కార్తిక్ గౌడ్ బృందంతో జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here