ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటా : కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని కార్పొరేటర్ వి.జగదీశ్వర గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోనే మాదాపూర్ డివిజన్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని, డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ/బస్తీలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు మాదాపూర్ డివిజన్ పరిధిలోని మొండి కుంటా, కనమేట్ వద్ద స్థానికులతో కలిసి మొండి కుంత అభివృద్ధికి, చెరువు అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ గౌస్, గంగల గణేష్ యాదవ్, శ్యామ్, లోకేష్, మహేందర్, ఇరిగేషన్ డి.ఈ నళిని పాల్గొన్నారు.

మొండి కుంటా, కనమేట్ స్థానికులతో కలిసి పర్యటిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here