జిహెచ్ఎంసి ఎలక్రిసిటీ అధికారులతో సమీక్షా

  • విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని, నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆదేశం

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంద్రదీప్, ఏఈ రాజశేఖర్ తో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్లోని నల్లగండ్ల గూడా కాలనీ, గోపనపల్లి, ఎన్టీఆర్ నగర్, గోపనపల్లి తండాలో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. పురాతన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని, వీధిలైట్లు వెలిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. వీధిలైట్ల పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్లో వీధి దీపాలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఈఈ ఇంద్రదీప్, ఏఈ రాజశేఖర్, నేతాజీ నగర్ కాలనీ ఉప అధ్యక్షుడు రాయుడు, సీనియర్ నాయకులు ప్రభాకర్ పాల్గొన్నారు.

గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంద్రదీప్ తో మాట్లాడుతున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here