సమస్యల పరిష్కారమే ధ్యేయం : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని నీలిమ గ్రీన్స్, ప్రగతి ఎనక్లేవ్, FCI కాలనీలలో పలు సమస్యలు, చేపట్టవల్సిన పనులను స్థానికులు, GHMC అధికారులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కాలనీలలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా రోడ్లు, తాగునీటి పైప్ లైన్, డ్రైనేజి, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబంధిత సమస్యలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో విడతలవారీగా పరిష్కరిస్తామని, డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో GHMC ఈ ఈ శ్రీక్రాంతిని, డి ఈ ప్రవీణ్, ఏ ఈ శివ ప్రసాద్, వర్క్ ఇన్స్పెక్టర్, నవీన్, ఏస్ అర్ పి లు కనకా రాజు, మహేష్, స్థానికులు సునీత, సుప్రజా, ఉమకిషన్, టాగూర్, పాల్గొన్నారు.

కాలనీలలో పలు సమస్యలు, చేపట్టవల్సిన పనులను చేపట్టేందుకు స్థానికులు, GHMC అధికారులతో పర్యటించి ఆ ప్రాంతాలను కలసి పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here