ముంపు ప్రాంతాల్లో నాలాల అభివృద్ధికి సత్వర చర్యలు: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మొహర్ పార్క్ కాలనీలోని వరదనీటి కాల్వ గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు పొంగి పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గత విపత్తును దృష్టిలో పెట్టుకుని మల్లి సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. దీనికి స్పందించిన అధికారులు ఏఈ సునీల్ తో కలిసి గుల్మొహర్ పార్క్ కాలనీ ప్రాంతంలో పర్యటించారు. వరదనీటి సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అదికారులకు గంగాధర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. నాలాలో వరదనీరు సాపీగా వెళ్లేందుకు ఇరువైపులా విస్తరించాలని.. సాధ్యమైనంత వరకు చెత్త చెదారాన్ని తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ సునీల్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, గుల్మొహర్ పార్క్ కాలనీ వాసులు పాల్గొన్నారు

గుల్మొహర్ పార్క్ కాలనీలోని వరదనీటి కాల్వ ను పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here