సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం : కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు వెళ్తున్నామని డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ మెయిన్ రోడ్డు, సాయి నగర్ తండా బస్తీలో డివిజన్ నాయకులు, బస్తి సభ్యులతో కలిసి పర్యటించారు.

సాయి నగర్ మెయిన్ రోడ్డు వద్ద రోడ్డు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్, సహదేవ్, గోపాల్ నాయక్, రాంబాబు, జితయ్యా, యూత్ సభ్యులు గోపాల్, సుబ్రమణ్యం, శివ నాయక్, ప్రేమ పాల్గొన్నారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలో డివిజన్ నాయకులు, బస్తి సభ్యులతో కలిసి పర్యటిస్తున్న జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here