మౌలిక వసతుల కల్పనకు కృషి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీజ బృందావనం కాలనీ, డాక్టర్స్ రెడ్డీస్ కాలనీ లోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేశారు.

శ్రీజ బృందావనం కాలనీ, డాక్టర్స్ రెడ్డీస్ కాలనీ లో నెలకొన్న సమస్యలు తెలుసుకుంటున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

అనంతరం మాట్లాడుతూ శ్రీజ బృందావనం కాలనీ, డాక్టర్స్ రెడ్డీస్ కాలనీల్లో కాలనీల ప్రజల విజ్ఞప్తి మేరకు కాలనీలో పాదయాత్ర చేశామని, శ్రీజ బృందావనం కాలనీ, డాక్టర్స్ రెడ్డీస్ కాలనీలలో పలు సమస్యలను పరిశీలంచామని తెలిపారు. కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో బిఆర్ఏస్,
నాయకులు ప్రతాప్ రెడ్డి , శివయ్య , సూర్యనారాయణ, టి వి రావు, కృష్ణ రావు, భాస్కర్ రావు, సంజయ్, అజయ్, వివేక్ , కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here