సీఎం సహాయ నిధి అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన సుధాకర్ ముఖ్యమంత్రి సహాయనిది సీఎంఆర్ ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా.. రూ. 2 లక్షలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చెక్కు రూపేణా అందజేశారు.

బాధిత కుటుంబానికి సీఎంఆర్ ఎఫ్ చెక్కు అందజేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here