అభాగ్యులకు అండ సీఎం సహాయనిధి : ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎం ఆర్ ఎఫ్ నుంచి రూ.6 మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎం ఆర్ ఎఫ్ఎల్ ఓసి మంజూరి పత్రాలను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి బాధిత కుటుంబాలకి అందచేషారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ.

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీ కి చెందిన అంజయ్యకు రూ. 2 లక్షల 50 వేలు, శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్ కి చెందిన రాజుకు రూ. 2 లక్షల 50 వేలు, మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కి చెందిన రామారావుకి రూ. 1 లక్ష మంజూరైనట్లు తెలిపారు. నిరుపేదలకు , అభాగ్యులకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లకు బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోతుల రాజేందర్, సద్దాం, శ్రావణి రెడ్డి, విమల, రేణుక, స్వప్న పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here