ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందజేస్తాం : మొవ్వ సత్య నారాయణ

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ లో మహావీర్ ఇంటర్నేషనల్ (సైబరాబాద్) ఆధ్వర్యంలో మొవ్వా చారిటబుల్ ట్రస్ట్ సహ సహకారంతో ఆనంద్ మేళా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మొవ్వా సత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన వస్తు ఉత్పత్తుల గురించి తెలుసుకున్నారు. సందర్బంగా మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ మహావీర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇలాంటి గొప్ప కార్యక్రమం తలపెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమని, మొవ్వా చారిటబుల్ ట్రస్ట్ సహాయ సహకారాలు ఎళ్లవేళలా ఉంటాయని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here