ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం సీఎంఆర్ఎఫ్ : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ ద్వారా రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ పత్రాలను కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి బాధిత కుటుంబాలకి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను వెల్లడించారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కి చెందిన సంజీవకు రూ. 2 లక్షల 50 వేలు, వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రీక్షపుల్లర్స్ కాలనీ కి చెందిన సమక్కకు రూ. 1 లక్ష 50 వేలు, కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన శివకు రూ. 1 లక్ష మంజూరైనట్లు ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు కాశీనాథ్ యాదవ్, దాసరి గోపి కృష్ణ, సంగమేష్ పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ పత్రాలను కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి బాధిత కుటుంబాలకి అందజేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here