నిర్ణీత సమయంలో సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలి

  • కాలనీ వాసులతో కలిసి పనులు పరిశీలించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవ నగర్ కాలనీలో రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కాలనీ వాసులతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యతా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని కార్పొరేటర్ అధికారులకు ఆదేశించారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కేశవ నగర్ కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు ఈశ్వర్, రాజు, బాలకృష్ణ, బలరాం, శ్రీను, రాజు, రమేష్, యాదయ్య, మహాదేవ్ అప్ప, శైలు, హనుమంత్, నగేష్, రాజు, శ్యామ్, కేశవ నగర్ కాలనీ వాసులు, కార్యకర్తలు, స్థానిక నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

కేశవ నగర్ కాలనీలో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here